ముగ్గురు బైక్​ దొంగలును పట్టుకున్న పోలీసులు

ముగ్గురు బైక్​ దొంగలును పట్టుకున్న పోలీసులు

 జీడిమెట్ల, వెలుగు : ఇంటి ముందు పార్కింగ్ చేసిన బైక్​లను టార్గెట్ గా చేసుకుని చోరీ చేస్తున్న దొంగలను పేట్​బషీరాబాద్ ​పోలీసులు పట్టుకున్నారు. ఏసీపీ రాములు శుక్రవారం మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. కామారెడ్డికి చెందిన ఆటో మెకానిక్ బక్కోల్ల నవీన్​గౌడ్(34) ​, పెయింటర్ పల్లికొండ దేవరాజ్​(32),  స్టూడెంట్ ఎనుగుర్తి ప్రశాంత్​(19)లు కలిసి జల్సాల కోసం బైక్ ను చోరీ చేస్తున్నారు. 

బాధితుల కంప్లయింట్లతో రాచకొండ, సైబరాబాద్​కమిషనరేట్ పోలీసులు నిఘా పెట్టగా.. పేట్​బషీరాబాద్​పోలీసులు ముగ్గురిని అరెస్ట్​ చేశారు. నిందితుల వద్ద  20 బైక్​లను స్వాధీనం చేసుకుని రిమాండ్​కి తరలించారు.