MPTCని దారుణంగా కొట్టిన పోలీసులు

MPTCని దారుణంగా కొట్టిన పోలీసులు

మహబూబాబాద్ జిల్లా : న్యాయం కోసం ఆందోళన చేపట్టిన MPTCపై పోలీసులు దాడి చేసిన ఘటన మహబూబాబాద్ లో జరిగింది. రెండు రోజుకు క్రితం తొర్రురులో ట్రాక్టర్ బోల్తా పడి బుక్య శ్రీనివాస్ అనే వ్యక్తి చనిపోయాడు. మృతుడి ఫ్యామిలీకి కాంట్రాక్టర్ ఆర్థికసహయం చేయాలంటూ మృతుని బంధువులు ఆందోళన చేపట్టారు. ఆందోళనకు మద్దతు తెలిపిన అమ్మాపురం MPTC  విక్రమ్ రెడ్డిని పోలీసులు దారుణంగా కొట్టారు. అందరు చూస్తుండగానే బూతులు తిడుతూ.. దురుసుగా పిడిగుద్దులతో లాక్కెళ్లారు.

ఒక ప్రజాప్రతినిధిని అమానుషంగా దండించారంటూ స్థానికులు అడ్డుకున్నా వినకుండా దాడి చేశారు పోలీసులు. ఈడ్చుకుంటూ ఆటోలో పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లిన పోలీసులు..స్టేషన్ లోను దూసురుసుగా ప్రవర్తించారని తెలిపాడు బాధితుడు విక్రమ్ రెడ్డి. ఇదే సంఘటనపై సోమవారం హైదరాబాద్ లోని HRCని ఆశ్రయించనున్నట్లు తెలిపాడు. MPTC విక్రమ్ రెడ్డిపై పోలీసులు దాడి చేస్తుండగా పలువురు వీడియో తీసి, సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ గా మారింది. ఫ్రెండ్లీ పోలీస్ అంటే ఇదేనా అని పోలీసుల తీరును తప్పుబడుతున్నారు.