
మెహిదీపట్నం, వెలుగు: అక్రమంగా కారులో తరలుతున్న గంజాయిని ఎక్సైజ్ అధికారులు పట్టుకున్నారు. లంగర్ హౌస్ బాపు ఘాట్ వద్ద ఎక్సైజ్ సీఐ చంద్రశేఖర్ గౌడ్ ఆధ్వర్యంలో బుధవారం తనిఖీలు నిర్వహించారు. ఈ సమయంలో మహబూబ్ నగర్ కు చెందిన ఆంజనేయులు గౌడ్, ఎండీ.రబ్బాని శంషాబాద్ నుంచి గచ్చిబౌలికి కారులో 3.75 కిలోల గంజాయిని తీసుకెళ్తున్నారు.
గంజాయిని స్వాధీనం చేసుకుని నిందితులపై ఎక్సైజ్ అధికారులు కేసు నమోదు చేశారు. దూల్పేట్లో...ఎక్సైజ్ శాఖ ఎస్ టీఎఫ్ టీం లీడర్ అంజిరెడ్డి ఆధ్వర్యంలో ధూల్పేటలో తనిఖీలు నిర్వహించారు. తనిఖీల్లో 1.14 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకొని ఉమేష్ సింగ్, అరుణ భాయి, గోపాల్ సింగ్లపై కేసు నమోదు చేశారు.