గంజాయిపై ఉక్కుపాదం..పీడీ యాక్టు కింద జైలుకు పంపుతం​ : సత్యనారాయణ

గంజాయిపై ఉక్కుపాదం..పీడీ యాక్టు కింద జైలుకు పంపుతం​ : సత్యనారాయణ
  • పోలీస్​ కమిషనర్​ సత్యనారాయణ

నిజామాబాద్​,  వెలుగు:  జిల్లాలో గంజాయి అమ్మకాలు చేపట్టినా, వినియోగించినా పీడీ యాక్టు కింద జైలుకు పంపుతామని పోలీస్​ కమిషనర్​ సత్యనారాయణ హెచ్చరించారు. శనివారం ఆయన తన కార్యాలయంలో గంజాయి కేసులు ఎదుర్కొంటున్న వారితో పాటు గంజాయి వాడకానికి అలవాటుపడ్డ వ్యక్తులకు కౌన్సెలింగ్​​ ఇచ్చారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ..హత్యలు, దొంగతనాలు, అల్లర్లకు కారణమవుతున్న గంజాయిని సమూలంగా నిర్మించాల్సిన అవసరం ఉందన్నారు.

ALSO READ:  మంత్రి ఇంటి ముట్టడికి.. అంగన్వాడీల యత్నం

డబ్బు సంపాదన కోసం అమ్మకాలు చేసే వారికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఆపివేయిస్తామన్నారు. అనుమానితులపై దాడులు చేస్తామని వార్నింగ్​ ఇచ్చారు. గంజాయి జాడ తెలిపిన వారికి నగదు పారితోషికాలు అందిస్తామని వారి పేర్లు గోప్యంగా ఉంచుతామని తెలిపారు. కార్యక్రమంలో డీసీపీ జయరామ్​, ఏసీపీలు జగదీష్​చందర్​,  కె.కిరణ్​కుమార్​, కె.వి.కిరణ్​కుమార్​ తదితరులు పాల్గొన్నారు.