హైదరాబాద్ లో అర్ధరాత్రి పలుచోట్ల పోలీసుల దాడులు

హైదరాబాద్ లో అర్ధరాత్రి పలుచోట్ల పోలీసుల దాడులు

హైదరాబాద్ : హైదరాబాద్ లో అర్ధరాత్రి పలుచోట్ల పోలీసులు దాడులు నిర్వహించారు. ఎస్ఐబీ, కౌంటర్ ఇంటెలిజెన్స్, టాస్క్ ఫోర్స్ పోలీసులు రైడ్స్ చేశారు. ముసారాంబాగ్ , బాబానగర్, సైదాబాద్, సంతోష్ నగర్ లలో సోదాలు నిర్వహించారు. దాదాపు 15 ఇండ్లలో తనిఖీలు జరిపి 20 మంది యువకులను అదుపులోకి తీసుకున్నారు. బేగంపేట్ బ్లాస్ట్ కేసులో ఒక పాత నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. 

అబ్దుల్ జాహెద్ అనే వ్యక్తి ఆధ్వర్యంలో ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అబ్దుల్ జాహెద్ తో పాటు 20మంది యువకులను కూడా పోలీసులు రహస్య ప్రదేశంలో విచారణ చేస్తున్నారని తెలుస్తోంది. అనుమానితుల బ్యాంకు ఖాతాల లావాదేవీలపైనా అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. కొంతమంది బ్యాంకు అకౌంట్స్ లోకి ఇప్పటికే పెద్ద మొత్తంలో నగదు బదిలీ అయినట్లు సమాచారం అందుతోంది. అనుమానితుల పాస్ పోర్ట్స్, ఆధార్ కార్డులు, బర్త్ సర్టిఫికెట్స్ ను స్వాధీనం చేసుకున్నారు.