రాజేంద్రనగర్ సెగ్మెంట్​లో పోలీసుల ఫ్లాగ్ మార్చ్

 రాజేంద్రనగర్ సెగ్మెంట్​లో పోలీసుల ఫ్లాగ్ మార్చ్

శంషాబాద్, వెలుగు: ఎన్నికల నేపథ్యంలో ఓటు హక్కుపై అవగాహన కల్పించేందుకు రాజేంద్రనగర్ సెగ్మెంట్ పరిధిలో డీసీపీ జగదీశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు ఆదివారం ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. శాస్త్రిపురం, వట్టేపల్లి పరిధిలో సీఐఎస్ఎఫ్, స్థానిక పోలీసులు ఫ్లాగ్ మార్చ్ నిర్వహించి ఓటు హక్కుపై అవగాహన కల్పించారు.

ఓటు హక్కును ధైర్యంగా వినియోగించుకోవాలని డీసీపీ జగదీశ్వర్ రెడ్డి సూచించారు. ఎవరైనా భయపెట్టడానికి ప్రయత్నిస్తే వెంటనే పోలీసులకు కంప్లయింట్ చేయాలన్నారు. కార్యక్రమంలో ఏసీపీ గంగాధర్, మైలార్​దేవ్ పల్లి సీఐ మధు, ఎస్సైలు పాల్గొన్నారు.