లండన్‌‌‌‌లో హైదరాబాదీ హత్య కేసు.. నిందితుడిపై మర్డర్ కేసు నమోదు

లండన్‌‌‌‌లో హైదరాబాదీ హత్య కేసు.. నిందితుడిపై మర్డర్ కేసు నమోదు

లండన్‌‌‌‌: హైదరాబాద్‌‌‌‌ స్టూడెంట్‌‌‌‌ తేజస్వినీ రెడ్డి లండన్​లో హత్యకు గురైన కేసులో బ్రెజిల్‌‌‌‌కు చెందిన 23 ఏండ్ల వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుడు కెవెన్‌‌‌‌ ఆంటోనియా లౌరెన్‌‌‌‌కో డి మోరైస్‌‌‌‌ను ఉక్స్‌‌‌‌ బ్రిడ్జ్‌‌‌‌ మెజిస్ట్రేట్‌‌‌‌ కోర్టులో హాజరుపర్చారు. ఈ కేసులో మరో ఇద్దరిని అరెస్ట్‌‌‌‌ చేసిన పోలీసులు.. హత్యతో వారికి సంబంధం లేదని విచారణలో తెలియడంతో విడుదల చేశారు. 

వెంబ్లీలోని షేరింగ్ అపార్ట్‌‌‌‌మెంట్‌‌‌‌లో తన స్నేహితురాలితో కలిసి ఉంటున్న తేజస్వినీపై కెవెన్‌‌‌‌ మంగళవారం కత్తితో దాడి చేశాడు. అడ్డుకోబోయిన ఆమె ఫ్రెండ్‌‌‌‌పై కూడా దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో తేజస్వినీ మృతి చెందగా, ఆమె ఫ్రెండ్‌‌‌‌ తీవ్రంగా గాయపడింది. ప్రస్తుతం ఆమె హాస్పిటల్‌‌‌‌లో కోలుకుంటోందని పోలీసులు చెప్పారు. దాడి చేసి పారిపోయిన కెవెన్‌‌‌‌ను నార్త్‌‌‌‌ లండన్‌‌‌‌లోని హారో ప్రాంతంలో అరెస్ట్‌‌‌‌ చేశామన్నారు.