ఏసీబీ జడ్జి ముందు మొయినాబాద్ నిందితుల హాజరు

ఏసీబీ జడ్జి ముందు మొయినాబాద్ నిందితుల హాజరు

మొయినాబాద్ ఫామ్ హౌస్ కేసులో ముగ్గురు నిందితులను సరూర్ నగర్ లోని ఏసీబీ కోర్టు న్యాయమూర్తి నివాసానికి తీసుకొచ్చారు. పోలీసులు భారీ బందోబస్తు నడుమ 8 పోలీస్ వాహనాల్లో నిందితులను తరలించారు. ఈ కేసులో రామచంద్ర భారతి, నంద కుమార్, సింహ యాజ్ లను న్యాయమూర్తి ముందు పోలీసులు హాజరుపరిచారు. జడ్జి ఇంటి ముందు పోలీసులు పటిష్ట భద్రతను ఏర్పాటు చేశారు.

మొయినాబాద్ ఫామ్ హౌస్  కేసులో ముగ్గురు నిందితులకు వైద్య పరీక్షలు పూర్తయ్యాయి.శంషాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ ఆవరణలో నే వైద్య పరీక్షలు పూర్తి చేసినట్టు వైద్యులు చెప్పారు.నర్కుడ పీహెచ్ సీ వైద్యుడు పీఎస్ కు వచ్చి నిందితులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. ముగ్గురి సెల్ ఫోన్లను  పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఫోన్ డేటా ఆధారంగా వీరు ఎవరితో టచ్ లోఉన్నారన్న కోణంలో ఎంక్వైరీ చేస్తున్నారు. ఇదిలా ఉంటే నందు అనే వ్యక్తి పొలిటికల్ లీడర్లతో దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి.