పేకాట స్థావరంపై దాడి..ఆరుగురు అరెస్ట్

పేకాట స్థావరంపై దాడి..ఆరుగురు అరెస్ట్

రంగారెడ్డి జిల్లా నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో  పేకాట స్థావరంపై ఎస్ వోటీ  పోలీసుల దాడులు చేశారు. కోకాపేట్ గ్రామం లేబర్ అడ్డాలో రేకుల షెడ్డులో నిర్వహిస్తున్న పేకాట స్థావరంపై పోలీసులు దాడి చేశారు. ఈ దాడుల్లో  పోలీసులు ఆరుగురిని  అదుపులోకి తీసుకున్నారు.  వారి నుంచి  లక్షా 70 వేల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసిన నార్సింగి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.