మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (MAA) ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఉదయం 8 గంటలకు మొదలైన పోలింగ్ సాయంత్రం 3 గంటల వరకు కొనసాగింది. పోలింగ్ సమయం పూర్తైన తర్వాత అప్పటికే క్యూలైన్లో ఉన్నవారికి ఓటేసేందుకు అనుమతించారు. గతంలో ఎన్నడూ లేనంతగా ఈ సారి MAA 600కు పైగా ఓట్లు పోలైనట్లు అంచనా. గతంలో పోల్చితే ఈసారి పోలింగ్ శాతం పెరిగింది. బెంగళూరు, ముంబై, చెన్నై నుంచి వచ్చి ఓటేశారు.
ఇక సాయంత్రం 5 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభం కానున్నట్టు తెలుస్తోంది. ఈ రాత్రికి ఫలితాలను ప్రకటించే అవకాశాలున్నాయి.