యూపీలో పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఓటర్లు ఉత్సాహం చూపుతున్నారు. ఉత్తర్ ప్రదేశ్లో మూడో దశ పోలింగ్ లో 59 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఓటింగ్ జరుగుతోంది. మధ్యాహ్నం ఒంటి గంట వరకు 35.88శాతం మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ దఫా ఎన్నికల్లో 627 మంది అభ్యర్థులు అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.
పంజాబ్లోనూ ఓటింగ్ సజావుగా సాగుతోంది. ఉదయం నుంచి ఓటర్లు పోలింగ్ బూత్ ల వద్ద బారులు తీరారు. పంజాబ్లో మధ్యాహ్నం ఒంటిగంట వరకు 34.10 శాతం మంది ఓటు వేశారు. 117 అసెంబ్లీ స్థానాలకు ఒకే దశలో ఎన్నిక జరుగుతోంది. 1,304 మంది అభ్యర్థుల భవిష్యత్తును 2.14 కోట్ల మంది ఓటర్లు నిర్ణయించనున్నారు.
Voter turnout till 1 pm | #PunjabElections2022 : 34.10%#UttarPradeshElections2022 (third phase) : 35.88% pic.twitter.com/bvDKde8Lcc
— ANI (@ANI) February 20, 2022