టెన్త్​ సప్లిమెంటరీ రిజల్ట్స్​ రాకముందే పాలిసెట్​ కౌన్సెలింగ్ ​కంప్లీట్

టెన్త్​ సప్లిమెంటరీ రిజల్ట్స్​ రాకముందే పాలిసెట్​ కౌన్సెలింగ్ ​కంప్లీట్

హైదరాబాద్, వెలుగు:  విద్యాశాఖ ఉన్నతాధికారుల మధ్య సమన్వయ లోపంతో స్టూడెంట్స్​ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు రాకముందే.. ఎంసెట్ ఫస్ట్ ఫేజ్ స్లాట్ బుకింగ్ గడువు ముగిసింది. మరోపక్క టెన్త్ సప్లిమెంటరీ రిజల్ట్స్​ విడుదల గాకముందే పాలిసెట్ అడ్మిషన్ల ప్రక్రియ ముగిసింది. దీంతో ఇంటర్, టెన్త్ సప్లిమెంటరీ విద్యార్థులు, వారి పేరెంట్స్ ఆందోళన చెందుతున్నారు.  రాష్ట్రంలో ఆగస్టు 21 నుంచి ఎంసెట్ అడ్మిషన్ కౌన్సెలింగ్ మొదలైంది. సర్టిఫికెట్ల వెరిఫికేషన్​ కోసం ఈనెల 29వ తేదీతో స్లాట్ బుకింగ్ ప్రక్రియ ముగిసింది. 30తో సర్టిఫికెట్ల ప్రక్రియ ముగియనుంది. అయితే రాష్ట్రంలో  ఆగస్టు 1 నుంచి10 వరకు ఇంటర్ అడ్వాన్స్​డ్ సప్లిమెంటరీ పరీక్షలు జరిగాయి. దీంట్లో సెకండియర్ స్టూడెంట్లు 1.13 లక్షల మంది అటెండ్ అయ్యారు. మెజార్టీ స్టూడెంట్స్​ ఎంపీసీ వారే. 

పాలిసెట్ చాన్స్ మిస్
టెన్త్ అడ్వాన్స్​డ్ సప్లిమెంటరీ ఎగ్జామ్స్​ ఆగస్టు 1–10 మధ్య జరిగాయి. 55వేల మంది అటెండ్ అయ్యారు. టెన్త్ పాసైన స్టూడెంట్సే.. పాలిసెట్​కు అర్హులు. సప్లిమెంటరీ రాసిన వారు పాలిసెట్ ఎగ్జామ్ రాశారు. సప్లిమెంటరీ స్టూడెంట్స్​ను పట్టించుకోకుండానే పాలిసెట్ కౌన్సెలింగ్ పూర్తి చేశారు. స్పాట్ అడ్మిషన్స్​ ప్రాసెస్ కూడా కంప్లీట్​అయ్యింది. పాలిసెట్ చేయాలనుకున్న టెన్త్ సప్లిమెంటరీ రాసిన విద్యార్థులకు ఆ చాన్స్​ లేకుండా పోయింది. సప్లిమెంటరీ రిజల్ట్స్​ పది రోజుల్లోనే ఇచ్చే చాన్స్​ ఉన్నా.. పరీక్షల విభాగం అధికారులు పట్టించుకోలేదని స్టూడెంట్స్​ పేరెంట్స్​ ఆరోపిస్తున్నారు. ఇంటర్​లో మూడున్నర లక్షల మంది రిజల్ట్స్​ మంగళవారం రిలీజ్ చేస్తున్నా, టెన్త్​లో 55వేల మంది రాసిన ఫలితాలు ఎప్పుడు ఇస్తారో కూడా స్పష్టత లేకుండా పోయింది.

ఇయ్యాల్నే ఇంటర్​ సప్లి రిజల్ట్స్​!
వ్యాల్యుయేషన్ ముగిసింది. రిజల్ట్ ప్రాసెస్ కొనసాగుతున్నది. పేరెంట్స్ నుంచి ఒత్తిడి రావడంతో 30న ఫలితాలు ఇస్తామని సోమవారం ఇంటర్ బోర్డు ప్రకటించింది. సోమవారంతోనే సర్టిఫికెట్ల వెరిఫికేషన్​ కోసం స్లాట్ బుకింగ్ గడువు ముగియడంతో విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. ఎంసెట్ లో మంచి ర్యాంక్ వచ్చినా, ఇంటర్ ఫలితాల ఆలస్యం కారణంగా పేరొందిన ఇంజనీరింగ్​ కాలేజీలు మిస్ అవుతామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంటర్ బోర్డు, ఉన్నత విద్యామండలి మధ్య సమన్వయ లోపంతో ఫస్ట్ ఫేజ్ కౌన్సెలింగ్​లో అటెండ్ కాలేని పరిస్థితి నెలకొన్నదని చెబుతున్నారు. ఎంసెట్ రిజిస్ర్టేషన్లు, స్లాట్ బుకింగ్ గడువు పెంచాలని స్టూడెంట్స్​ డిమాండ్ చేస్తున్నారు.