చర్చకు రాకుండా కేసీఆర్ ఫాంహౌస్​లో పంటడు: పొన్నాల లక్ష్మయ్య

చర్చకు రాకుండా కేసీఆర్ ఫాంహౌస్​లో పంటడు: పొన్నాల లక్ష్మయ్య

హైదరాబాద్,వెలుగు: రాష్ట్ర  ప్రజల ముందుకు సీఎం కేసీఆర్​ ఎందుకు రావడం లేదని పీసీసీ మాజీ చీఫ్​ పొన్నాల లక్ష్మయ్య ప్రశ్నించారు. కాంగ్రెస్​ గ్యారెంటీల మీద చర్చకు రాకుండా ఫాం హౌస్​లో  పడుకుని..ఆయన తన పార్టీ నేతలతో మాట్లాడిస్తున్నారని ఫైర్ అయ్యారు.  గురువారం పొన్నాల  గాంధీభవన్​లో మీడియాతో మాట్లాడారు. ఇచ్చిన ఏ మాట మీదా కేసీఆర్​ నిలబడలేదని విమర్శించారు. 

కరెంట్​ విషయంలో ప్రజలపై రూ.50 వేల కోట్ల భారాన్ని మోపారని మండిపడ్డారు. సాగునీటి ప్రాజెక్టుల్లోనూ అన్యాయం చేశారన్నారు. కాంగ్రెస్ ఎప్పుడు ఏ హామీ ఇచ్చినా నెరవేర్చిందని  చెప్పారు. ప్రస్తుతం ఇచ్చిన గ్యారెంటీ స్కీములనూ అమలు చేస్తామన్నారు. మహిళా బిల్లు ఘనత కాంగ్రెస్​ పార్టీదేనని వెల్లడించారు.