- ఉన్నతాధికారులతో జూమ్ మీటింగ్లో మంత్రి పొన్నం
హైదరాబాద్, వెలుగు: ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లు, ఇతర సిబ్బంది, ప్రయాణికులతో అధికారులు ముఖ్యంగా డిపో మేనేజర్లు స్నేహపూర్వకంగా మెలగాలని రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశించారు. శనివారం ఆర్టీసీ ఉన్నతాధికారులతో జూమ్ మీటింగ్ నిర్వహించారు. ఆర్టీసీ సిబ్బంది సమస్యలను వినేందుకు ప్రతి నెల రెండో మంగళవారం అన్ని డిపోలలో ఫిర్యాదుల పరిష్కార సమావేశాలు నిర్వహించాలన్నారు. ఈ నెల 17లోపు అన్ని డిపోలు, బస్సు స్టేషన్లలో కనీస సౌకర్యాలను మెరుగుపరచడంపై దృష్టిపెట్టాలని సూచించారు. ప్రజాప్రతినిధులను గౌరవించుకుంటూ వారిని సమన్వయం చేసుకుంటూ మహాలక్ష్మి పథకాన్ని విజయవంతంగా అమలయ్యేలా చూడాలని చెప్పారు.
