రాముడు అందరి వాడని, బీజేపీ, విశ్వ హిందూ పరిషత్ మాత్రమే చాంపియన్లుగా చెప్పుకోవడం బాధాకరమన్నారు పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్. కేంద్రమే అయోధ్యలో రామ మందిరం నిర్మించాలని చెప్పారు. కరీంనగర్ జిల్లా ఇల్లందకుంట మండల కేంద్రంలోని శ్రీ సీతారామ చంద్రస్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు పొన్నం. కరీంనగర్ నుంచి ఎంపీగా గెలిచిన సంజయ్ ఎప్పుడైనా ఇల్లందకుంట రాములవారి ఆలయాన్ని పట్టించుకున్నారా అని ప్రశ్నించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎత్తివేస్తే ఊరుకోబోమన్నారు. మంత్రి ఈటల రాజేందర్ బయట సభల్లో మాట్లాడినట్లే… కేబినెట్ మీటింగులో కూడా గళమెత్తాలన్నారు పొన్నం.
see more news