కోలీవుడ్‭లో విషాదం.. ప్రముఖ కమెడియన్ మృతి

కోలీవుడ్‭లో విషాదం.. ప్రముఖ కమెడియన్  మృతి

సినీ ఇండస్ట్రీని వరుస విషాదాలు వెంటాడుతున్నాయి. తారకరత్న మరణ వార్త నుంచి కోలుకోక ముందే మరో విషాదం చోటుచేసుకుంది. కోలీవుడ్ ప్రముఖ కమెడియన్ మయిల్ స్వామి ఆనారోగ్యంతో కన్నుమూశారు. తమిళంలో పలు సినిమాల్లో తన హాస్యంతో ప్రేక్షకులను అలరించారు. ఆయన వయస్సు 57 సంవత్సరాలు. ఉదయం మయిల్ స్వామి ఆనారోగ్యం బారిన పడినట్లు గుర్తించిన కుటుంబసభ్యులు సమీపంలోని పోరూర్‭లోని ఆస్పత్రికి తరలించారు. ఆయన్ను పరీక్షించిన వైద్యులు అప్పటికే మయిల్ స్వామి మృతి చెందినట్లు తెలిపారు. మయిల్ స్వామి మృతి పై రాజకీయ ప్రముఖులతో పాటు సినీ సెలబ్రిటీలు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.  

1984లో కమెడియన్‌గా సినీ ప్రస్థానం మొదలు పెట్టిన మయిల్ స్వామి ఆ తర్వాత వెనుదిరిగి చూసుకోలేదు. ఎన్నో సినిమాల్లో తన కామెడీ టైమింగ్‌తో ప్రేక్షకులను నవ్వించారు. చివరి శ్వాస వరకు కూడా ఆయన నటిస్తూనే ఉన్నారు. మయిల్ స్వామి మరణంతో కోలీవుడ్ చిత్రసీమలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈయన మృతిపై తెలంగాణ గవర్నర్ తమిళసై సౌందరరాజన్ ట్విట్టర్ వేదికగా సంతాపం వ్యక్తం చేశారు. హాస్యనటుడు మయిల్ స్వామి అనారోగ్య కారణాలతో మరణించారనే వార్త విని తాను బాధపడినట్టు తమిళ సై పేర్కొన్నారు.