
న్యూఢిల్లీ: దేశమంతటా పోస్ట్ ఆఫీస్లు ఆగస్టు నుంచి కౌంటర్లలో డిజిటల్ చెల్లింపులను అంగీకరించడం ప్రారంభిస్తాయని అధికారిక వర్గాలు తెలిపాయి. ఇందు కోసం ఐటీ సిస్టమ్లో మార్పులు చేస్తున్నట్టు పేర్కొన్నాయి. పోస్ట్ ఆఫీస్లు తమ ఖాతాలను యూపీఐ సిస్టమ్తో సింక్ చేయపోవడంతో ప్రస్తుతం డిజిటల్ చెల్లింపులను అంగీకరించడం లేదు. డైనమిక్ క్యూఆర్ కోడ్తో లావాదేవీలు నిర్వహించడానికి వీలు కల్పించే కొత్త అప్లికేషన్లను తపాలా శాఖ ఐటీ విభాగం డెవలప్ చేస్తోంది.
ఐటి 2.0 కింద కొత్త వ్యవస్థను కర్ణాటక సర్కిల్లో ప్రయోగాత్మకంగా ప్రారంభించారు. క్యూఆర్- ఆధారిత బుకింగ్ను నిర్వహించారు. ప్రారంభంలో, డిజిటల్ లావాదేవీలను ప్రారంభించడానికి తపాలా శాఖ పోస్టాఫీసులలోని పాయింట్ ఆఫ్ సేల్ కౌంటర్లలో స్టాటిక్ క్యూఆర్ కోడ్ను ప్రవేశపెట్టింది. అయితే టెక్నికల్ సమస్యలు రావడంతో ఈ విధానాన్ని నిలిపివేయాల్సి వచ్చింది.