గుడ్ న్యూస్.. పోస్ట్ ఆఫీస్‌‌‌‌ల్లో డిజిటల్ చెల్లింపులు

గుడ్ న్యూస్.. పోస్ట్ ఆఫీస్‌‌‌‌ల్లో డిజిటల్ చెల్లింపులు

న్యూఢిల్లీ: దేశమంతటా పోస్ట్ ఆఫీస్‌‌‌‌లు ఆగస్టు నుంచి కౌంటర్లలో డిజిటల్ చెల్లింపులను అంగీకరించడం ప్రారంభిస్తాయని అధికారిక వర్గాలు తెలిపాయి. ఇందు కోసం ఐటీ సిస్టమ్​లో మార్పులు చేస్తున్నట్టు పేర్కొన్నాయి. పోస్ట్ ఆఫీస్‌‌‌‌లు తమ ఖాతాలను యూపీఐ సిస్టమ్‌‌‌‌తో సింక్​ చేయపోవడంతో ప్రస్తుతం డిజిటల్ చెల్లింపులను అంగీకరించడం లేదు. డైనమిక్ క్యూఆర్​ కోడ్‌‌‌‌తో లావాదేవీలు నిర్వహించడానికి వీలు కల్పించే కొత్త అప్లికేషన్‌‌‌‌లను తపాలా శాఖ ఐటీ విభాగం డెవలప్​ చేస్తోంది.

ఐటి 2.0 కింద కొత్త వ్యవస్థను కర్ణాటక సర్కిల్‌‌‌‌లో ప్రయోగాత్మకంగా ప్రారంభించారు. క్యూఆర్​- ఆధారిత బుకింగ్​ను నిర్వహించారు. ప్రారంభంలో, డిజిటల్ లావాదేవీలను ప్రారంభించడానికి తపాలా శాఖ పోస్టాఫీసులలోని పాయింట్ ఆఫ్ సేల్ కౌంటర్లలో స్టాటిక్ క్యూఆర్​ కోడ్‌‌‌‌ను ప్రవేశపెట్టింది. అయితే  టెక్నికల్​ సమస్యలు రావడంతో ఈ విధానాన్ని నిలిపివేయాల్సి వచ్చింది.