
- పలువురు సీనియర్ అధికారులకూ సమాచారముంది
- సాక్షులుగా గోనె ప్రకాశ్, సుభాశ్ రెడ్డి నుంచి వాంగ్మూలం
- కవిత ఫోన్ కూడా ట్యాప్ చేశారు: గోనె ప్రకాశ్
హైదరాబాద్, వెలుగు: 2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలో జరిగిన ఫోన్ట్యాపింగ్ గురించి అప్పటి డీజీపీ సహా ఉన్నతాధికారులకు అంతా తెలుసని ప్రధాన నిందితుడు ప్రభాకర్ రావు సిట్ముందు వెల్లడించినట్లు తెలిసింది. ఐదోరోజు విచారణలో భాగంగా ప్రభాకర్రావు శుక్రవారం (June 20) సిట్ ముందు హాజరయ్యాడు. ఉదయం 11 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు సిట్అధికారులు ఆయనను విచారించారు.
2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలో డీజీపీ ఆదేశాల మేరకే నేతల ఫోన్లు ట్యాప్చేసి, రైడ్స్ జరిపామని చెప్పినట్లు సమాచారం. కాగా, గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో డీజీపీ అంజనీకుమార్ విధులు నిర్వర్తించారు. అదే సమయంలో సిటీ టాస్క్ఫోర్స్ డీసీపీ రాధాకిషన్ రావు ఓఎస్డీగా పనిచేశారు. ఫోన్ ట్యాపింగ్తోనే ప్రతిపక్షాలకు చెందిన నగదును భారీగా పట్టుకున్నారని అప్పట్లో ఆరోపణలు వినిపించాయి.
కేసీఆర్, సంతోష్రావే చేయించిన్రు: గోనె ప్రకాశ్
ఆర్టీసీ మాజీ చైర్మన్ గోనె ప్రకాశ్రావు శుక్రవారం సిట్ ముందు సాక్షిగా హాజరయ్యారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో తన ఫోన్ ట్యాప్ అయిందనే అనుమానాలు వ్యక్తం చేశారు. ఇందుకు సంబంధించి సిట్అధికారులకు తన దగ్గరున్న సమాచారం అందజేశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ప్రభాకర్ రావు ఫోన్ ట్యాపింగ్ చేసి ఆ రిపోర్ట్ను కేసీఆర్, సంతోష్ రావుకు అందించారని తెలిపారు. కేసీఆర్, సంతోష్రావు కలిసి కవిత ఫోన్ కూడా ట్యాప్ చేశారని గోనె ప్రకాశ్రావు ఆరోపించారు. ఓటుకు నోటు, ఎమ్మెల్యేల కొనుగోలు లాంటివి బయటపడడం వెనుక ఫోన్ట్యాపింగే కారణమని పేర్కొన్నారు. 2015 నుంచే బీఆర్ఎస్ సర్కారు ఫోన్ ట్యాపింగ్కు పాల్పడిందన్నారు. హుజూరాబాద్ ఎన్నికల నుంచి తన ఫోన్కూడా ట్యాప్ చేశారని గోనె ఆరోపించారు. కేసు దర్యాప్తును సీబీఐకి బదిలీ చేయాలని డిమాండ్ చేశారు. పీసీసీ కమిటీ సెక్రటరీ, ఉస్మానియా యూనివర్సిటీ స్టూడెంట్ యూనియన్ మాజీ అధ్యక్షుడు సుభాశ్ రెడ్డి కూడా సిట్విచారణకు హాజరయ్యారు. తాను ఓయూలో ఎలాంటి కార్యక్రమాలు చేసినా ఆ విషయం ముందుగానే పోలీసులకు తెలిసేదన్నారు. కొడంగల్, మల్కాజ్గిరి పార్లమెంట్ ఎన్నికల్లో సమయంలో కీలకంగా పనిచేశానని తెలిపారు.