బహుబలి సినిమాతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ప్రభాస్ ఆ తరువాత చేసిన ఏ ఒక్క సినిమా కూడా ఆయన అభిమానులతో పాటు ప్రేక్షకులను కూడా ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయాయి. భారీ అంచనాలతో తెరకెక్కిన ఆదిపురుష్ కూడా బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్గా మిగిలిపోయింది. ఈ క్రమంలో ప్రభాస్ కీలక నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది.
కొంతకాలం పాటు బాలీవుడ్ దర్శకులతో పని చేయకూడదని ప్రభాస్ అనుకుంటున్నట్లుగా తెలుస్తోంది. అంతేకాకుండా బాలీవుడ్ స్క్రిప్ట్లను వినడానికి కూడా ఆసక్తి చూపించడం లేదట ప్రభాస్ . ఇప్పటికే కమిట్ అయిన సిద్ధార్థ్ ఆనంద్ సినిమాను కూడా ప్రభాస్ క్యాన్సిల్ చేసినట్లుగా సమాచారం.
ఇక ప్రభాస్ ప్రస్తుతం ప్రశాంత్ నీల్ తో కలిసి సలార్ అనే సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రం 2023 సెప్టెంబర్ 28న విడుదల కానుంది. ఇందులో ప్రభాస్ సరసన శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తోంది.
మరోవైపు నాగ్ అశ్విన్ తో కలిసి ‘కల్కి 2898 ఏడీ’ సినిమా చేస్తున్నారు ప్రభాస్. ఇందులో దీపికా పదుకొనే హీరోయిన్ గా నటిస్తోంది. కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్ ఈ చిత్రంలో కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ రెండు సినిమాలపై ఫ్యాన్స్ భారీ అంచనాలే పెట్టుకున్నారు.