హైదరాబాద్, వెలుగు: అనేక దేశాలు అడ్డగోలుగా అప్పులు చేసి ఆర్థికంగా నాశనం అయ్యాయని.. తెలంగాణకు కూడా అదే ముప్పు పొంచి ఉందని ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ అన్నారు. ఈ పదేండ్లలో కేసీఆర్ అడ్డగోలుగా అప్పులు చేశాడని, ఇప్పుడు ఆ అప్పులకు వడ్డీలు, కిస్తీలు కట్టలేని స్థితిలో రాష్ట్రం ఉందని అన్నారు. హైదరాబాద్ అమీర్పేట్లోని పార్టీ ఆఫీసులో ఆయన మీడియాతో మాట్లాడారు.
ప్రజలు ఇప్పటికైనా ఆలోచించి కేసీఆర్ను ఓడించాలని, తనకు ఓ అవకాశం ఇవ్వాలని కోరారు. కేసీఆర్, కాంగ్రెస్ ఒక్కటేనని విమర్శించారు. కేటీఆర్ అమెరికా వెళ్లి బాత్రూంలు కడిగాడని, తాను అమెరికా వెళ్లి ఆ దేశాన్ని శాసించానని పాల్ అన్నారు. కేటీఆర్, కేసీఆర్ చేసిన బాగోతాలను మంగళవారం నిర్వహించే ప్రెస్ మీట్లో వెల్లడిస్తానన్నారు. టీడీపీ, కోదండరాం, షర్మిల పార్టీల పని అయిపోయిందని విమర్శించారు.