పారాలింపిక్స్ లో పతకం సాధించిన ప్రవీణ్ కుమార్

పారాలింపిక్స్ లో పతకం సాధించిన ప్రవీణ్ కుమార్

టోక్యో: పారాలింపిక్స్ లో భారత్ పతకాల జోరు కొనసాగుతోంది. పురుషుల హైజంప్ లో భారత అథ్లెట్ పతకం సాధించారు. మెన్స్ హైజంప్ టీ-64 విభాగంలో ప్రవీణ్ కుమార్ రజత పతకం సాధించాడు. 2.07 మీటర్ల ఎత్తుకు జంప్ చేసి రజతం సొంతం చేసుకున్నాడు.  దాంతో పారాలింపిక్స్ లో ఇప్పటి వరకు భారత్ సాధించిన మెడల్స్ సంఖ్య 12కు చేరింది. హైజంప్ విభాగంలో ఇది భారత్ కు నాలుగో పతకం కావడం విశేషం. భారత్ తరుపున పతకం సాధించిన ప్రవీణ్ కు ప్రధాని నరేంద్ర మోడీ అభినందనలు తెలిపారు. ఈ పథకం ప్రవీణ్ కృషి, అంకితభావానికి ప్రతిఫలం అని ఆయన ట్వీట్ చేశారు.