
విశ్వ కార్తికేయ, ఆయూషి పటేల్ జంటగా రమాకాంత్ రెడ్డి దర్శకత్వంలో డా. కందుల చంద్ర ఓబుల్ రెడ్డి, జి.మహేశ్వరరెడ్డి, కాటం రమేష్లు నిర్మించిన చిత్రం కలియుగం పట్టణంలో’. మార్చి 29న సినిమా విడుదల కాబోతోంది. మంగళవారం ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. హీరో సుమన్, నిర్మాత ఏ.ఎం.రత్నం ముఖ్య అతిథులుగా హాజరై సినిమా సూపర్ హిట్ సాధించాలని విష్ చేశారు. విశ్వ కార్తికేయ మాట్లాడుతూ ‘మదర్ సెంటిమెంట్తో కూడిన యూనిక్ థ్రిల్లర్ ఇది.
నన్ను నమ్మి ఇంత భారీ బడ్జెట్తో సినిమాను తీసిన నిర్మాతలకు, సపోర్ట్ చేసిన టీమ్ అందరికీ థ్యాంక్స్’ అన్నాడు. ప్రాధాన్యత గల పాత్రలో నటించడం సంతోషంగా ఉందని ఆయుషి పటేల్ చెప్పింది. ‘సినిమాలో నటించిన అందరికీ థ్యాంక్స్. ప్రేక్షకులంతా థియటర్లో చూసి ఆశీర్వదించండి’ అని దర్శకుడు కోరాడు. నటీనటులు, టెక్నీషియన్స్, అజయ్ మ్యూజిక్, చంద్రబోస్ సాహిత్యం లాంటివన్నీ అద్భుతంగా కుదిరాయని, కచ్చితంగా అందరినీ ఆకట్టుకునే చిత్రం అవుతుందని నిర్మాతలు చెప్పారు.