కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్​ తయారీ.. దాడుల్లో భయంకర విషయాలు

కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్​ తయారీ..  దాడుల్లో భయంకర విషయాలు

వారికి మనుషుల ఆరోగ్యాలంటే లెక్కలేదు. ప్రాణాలంటే పట్టింపే లేదు. విచ్చలవిడిగా ఆహారపదార్థాలు కల్తీ చేస్తూ.. పబ్లిక్​ ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్​ తయారు చేస్తున్న ముఠాని హైదరాబాద్ పోలీసులు ఆగస్టు 25న అదుపులోకి తీసుకున్నారు. 

వారు తెలిపిన వివరాల ప్రకారం... రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్​పరిధి ఉప్పర్​పల్లిలో ఓ యజమాని కల్తీ అల్లంవెల్లుల్లి పేస్ట్​తయారు చేసే పరిశ్రమ నడుపుతున్నాడు. దీనిని మార్కెట్లో విక్రయిస్తున్నాడు. 

విషయం తెలుసుకున్న ఎస్​ఓటీ పోలీసులు పరిశ్రమపై దాడులు నిర్వహించారు. ప్రమాదకర రసాయనాలను ఉపయోగించి అల్లం వెల్లుల్లి తయారు చేస్తున్నట్లు తనిఖీల్లో బయట పడింది. 

కెమికల్స్​తో పాటు యాసిడ్, కుళ్లిపోయిన పేస్టును ప్యాకింగ్​ చేసి ఎక్స్​పైరీ డేట్​ మార్చి అమ్ముతున్నట్లు పోలీసులు గుర్తించారు. దాడుల్లో 4 టన్నుల కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్​ని సీజ్​చేసి, ఇద్దరు నిందితుల్ని అదుపులోకి తీసుకున్నారు.