హనుమకొండ, వెలుగు: మెడికల్ షాపుల్లో దొరికే ట్యాబ్లెట్లతో డ్రగ్ పౌడర్ తయారు చేసి హైదరాబాద్కు సప్లయ్ చేస్తున్న ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లాలకు చెందిన ఓ ఆర్ఎంపీని వరంగల్ టాస్క్ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. ఇంకో ఇద్దరినీ అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ.2.13 లక్షల విలువైన ఒక కిలో డ్రగ్పౌడర్, 5 సెల్ ఫోన్లు, కారు స్వాధీనం చేసుకున్నారు. టాస్క్ ఫోర్స్ అడిషనల్ డీసీపీ వైభవ్ గైక్వాడ్ వివరాలు సోమవారం వెల్లడించారు. ఆర్ఎంపీగా పనిచేస్తున్న కారంపూడి మండలం పెదకొదమగుండ్లకు చెందిన లింగాల సైదులు.. అదే మండలానికి చెందిన పెరుమాండ్ల వెంకటేశ్ నడిపిస్తున్న మెడికల్ షాపు నుంచి ఆల్ప్రాజోలం ట్యాబ్లెట్ను కొనుగోలు చేసి వాటితో డ్రగ్ పౌడర్ తయారు చేయడం ప్రారంభించాడు.
హైదరాబాద్లో పెయింట్స్ బిజినెస్ చేసే తన బంధువు రాజశేకర్ని లక్ష్మణ్ రావు, మెహిదీపట్నంలో డ్రైవర్ గా పని చేసే పూసల చైతన్య కుమార్ సాయంతో ఆ పౌడర్ను కస్టమర్లకు చేరవేసేవాడు. న్యూఇయర్ వేడుకలప్పుడు అమ్మేందుకు డ్రగ్ పౌడర్ను కారులో హైదరాబాద్కు తరలిస్తుండగా హనుమకొండలోని అలంకార్ జంక్షన్ వద్ద టాస్క్ ఫోర్స్ పోలీసులు నిందితులను పట్టుకున్నారు. సైదులు, లక్ష్మణ్రావు, చైతన్య కుమార్ను అరెస్ట్ చేశారు. టాస్క్ ఫోర్స్ ఏసీపీ జితేందర్ రెడ్డి, సీఐ వెంకటేశ్వర్లు, ఏఏవో సల్మాన్ పాషా, సిబ్బంది సోమలింగం, మాధవరెడ్డి,
స్వర్ణ తదితరులను అడిషనల్ డీసీపీ వైభవ్ గైక్వాడ్ అభినందించారు.