మహాత్మగాంధీకి రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, ప్రధాని మోడీ నివాళి

మహాత్మగాంధీకి  రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, ప్రధాని మోడీ నివాళి

ఇవాళ మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా ఢిల్లీలోని రాజ్‌ఘాట్‌లో రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్ర మోదీ, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ నివాళులర్పించారు. ‘మహాత్మ గాంధీ పుణ్యతిథి నాడు బాపూజీ గారిని స్మరించుకుంటున్నారు. ఆయన ఉదాత్తమైన ఆశయాలను మరింత ప్రాచారంలోకి తీసుకురావడం  కోసం సమిష్టిగా ప్రయత్నించాలి. ఈ రోజు అమరవీరుల దినోత్సవం సందర్భంగా  మన జాతిని ధైర్యంగా కాపాడిన మహనీయులందరికీ నివాళులు అర్పిస్తున్నాము. వారి సేవ, ధైర్యసాహసాలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. అంటూ మోడీ ట్వీట్ చేశారు. గాంధీజీ వర్థంతి సందర్భంగా అహ్మదాబాద్‌లోని సబర్మతి రివర్ ఫ్రంట్‌లో మహాత్మా గాంధీ వాల్ పేపనర్ ఆవిష్కరించారు  కేంద్ర హోంమంత్రి అమిత్ షా.తమిళనాడు గవర్నర్ ఆర్‌ఎన్ రవి, సీఎం ఎంకే స్టాలిన్ బాపూజీకి నివాళులర్పించారు.