
- మహిళా రిజర్వేషన్ల బిల్లుపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
న్యూఢిల్లీ : కేంద్రం ప్రవేశపెట్టిన మహిళా రిజర్వేషన్ల బిల్లు.. మన కాలంలో జెండర్ జస్టిస్ కోసం చేపట్టిన విప్లవాత్మక మార్పు అని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. బుధవారం ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో నిర్వహించిన నేషనల్ హ్యూమన్ రైట్స్ ఇన్స్టిట్యూషన్స్ (ఎన్హెచ్ఆర్ఐ) ఆఫ్ ఆసియా పసిఫిక్ సదస్సును ముర్ము ప్రారంభించారు. తర్వాత ఆమె మాట్లాడుతూ.. ‘‘స్థానిక సంస్థల ఎన్నికల్లో మహిళలకు కనీసం 33 శాతం రిజర్వేషన్లు ఉండేలా మేం చేశాం.
మరింత సంతోషకరమైన విషయమేమిటంటే.. రాష్ట్ర అసెంబ్లీలు, లోక్సభలో మహిళలకు ఇదే విధమైన రిజర్వేషన్లు కల్పించే ప్రతిపాదన ఇప్పుడు రూపుదిద్దుకుంటోంది. జెండర్ జస్టిస్ కోసం చేపట్టిన అత్యంత ట్రాన్స్ఫర్మాటివ్ రివల్యూషన్ ఇది” అని చెప్పారు. నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ (ఎన్హెచ్ఆర్సీ), ఆసియా పసిఫిక్ ఫోరమ్ (ఏపీఎఫ్) సంయుక్తంగా ఈ కాన్ఫరెన్స్ను నిర్వహించాయి.