హైదరాబాద్లో పర్యటిస్తున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నారాయణగూడలోని కేశవ్ మెమోరియల్ విద్యాసంస్థను సందర్శించారు. గవర్నర్ తమిళిసై, కేంద్రమంత్రి కిషన్ రెడ్డితో కలిసి కేశవ్ మెమోరియల్ స్కూల్కు చేరుకున్నారు. హైదారాబాద్ విమోచన దినోత్సవ ఫొటో గ్యాలరీలో ఫోటోలను చూశారు. కళాశాలలో విద్యార్థులు, ఫ్యాకల్టీతో ప్రత్యేకంగా సమావేశం అయ్యారు.
హైదరాబాద్ పర్యటనలో భాగంగా ద్రౌపది ముర్ము పోలీస్ అకాడమీకి వెళ్లనున్నారు. మధ్యాహ్నం 3 నుంచి 4 గంటల వరకూ సర్దార్ వల్వభాయ్ పటేల్ నేషనల్ పోలీసు అకాడమీలో ఉంటారు. పోలీస్ అకాడమీలో అఖిల భారత పోలీస్ సేవల 74వ బ్యాచ్ ట్రైనీ అధికారులతో పాటు భూటాన్, నేపాల్, మారిషస్, మాల్దీవుల దేశాల అధికారులతో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సమావేశం కానున్నారు.