రాష్ట్రపతి నిలయంలో ఎట్ హోమ్.. హాజరైన గవర్నర్ తమిళిసై, సీఎం రేవంత్ రెడ్డి

రాష్ట్రపతి నిలయంలో ఎట్ హోమ్.. హాజరైన గవర్నర్ తమిళిసై, సీఎం రేవంత్ రెడ్డి

కంటోన్మెంట్, వెలుగు: సికింద్రాబాద్​ బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో శుక్రవారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము  ఎట్​హోమ్ ​కార్యక్రమం ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో భాగంగా రాష్ట్రపతి ఇచ్చిన తేనీటి విందుకు గవర్నర్​ తమిళిసైతో పాటు ముఖ్యమంత్రి రేవంత్​ రెడ్డి దంపతులు, శాసన సభ స్పీకర్ ​గడ్డం ప్రసాద్​ కుమార్,  హైకోర్టు చీఫ్​ జస్టిస్​ అలోక్​ అరాధే, చీఫ్ ​సెక్రటరీ శాంతి కుమారి, మంత్రులు దామోదర రాజనర్సింహ, సీతక్క, శ్రీనివాస్​రెడ్డి, మహారాష్ట్ర మాజీ గవర్నర్ ​విద్యాసాగర్ ​రావు, బీఆర్ఎస్​ నాయకులు కేటీఆర్, హరీశ్​ రావు, కే.కేశవరావు, మహమూద్​అలీ, పలువురు ఉన్నతాధికారులు హాజరయ్యారు. శీతాకాల విడిది కోసం డిసెంబరు 18న హైదరాబాద్​కు వచ్చిన రాష్ట్రపతి బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో బస చేస్తున్నారు. విడిది ముగించుకొని శనివారం ఆమె హైదరాబాద్​ నుంచి జైపూర్​కు వెళ్తున్నారు. ఆనవాయితీలో భాగంగా రాష్ట్రపతి నిలయంలో ఎట్​హోమ్​ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా గవర్నర్​తమిళిసై, సీఎం రేవంత్​ రెడ్డి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఇచ్చిన ఆతిథ్యానికి కృతజ్ఞతలు తెలిపారు.