AamirKhan: ‘సితారే జమీన్ పర్’ చూసిన రాష్ట్రపతి ముర్ము.. ఆమీర్ ఖాన్కు అభినందనలు

AamirKhan: ‘సితారే జమీన్ పర్’ చూసిన రాష్ట్రపతి ముర్ము.. ఆమీర్ ఖాన్కు అభినందనలు

బాలీవుడ్ స్టార్ ఆమిర్ ఖాన్ మంగళవారం (జూన్24న) ఢిల్లీలో రాష్ట్రపతి ద్రౌపది ముర్మును మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ విషయాన్ని రాష్ట్రపతి కార్యాలయం వెల్లడించింది.

ఆమిర్ ఖాన్ హీరోగా నటిస్తూ, నిర్మించిన  చిత్రం ‘సితారే జమీన్ పర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌’.జూన్ 20న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సందర్భంగా ఒలింపిక్ ఛాంపియన్స్‌‌‌‌‌‌‌‌ కోసం ఢిల్లీలో మూవీ స్పెషల్ స్క్రీనింగ్ ఏర్పాటుచేశారు. ఈ కార్యక్రమానికి హాజరైన ఆమిర్ ఖాన్.. రాష్ట్రపతిని కూడా కలుసుకున్నారు.

రాష్ట్రపతి కార్యాలయం Xలో పోస్ట్‌ను షేర్ చేసింది. "రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రాష్ట్రపతి భవన్ కల్చరల్ సెంటర్‌లో 'సితారే జమీన్ పర్' చిత్రాన్ని వీక్షించారు. నాడీ వైవిధ్య (NeuroDiversity) పరిస్థితులతో కూడిన నిజమైన వ్యక్తులను చూపించే ఈ చిత్రం వైవిధ్యం, సమానత్వం మరియు సమ్మిళిత సందేశాన్ని అల్లుకుంది. ఎంతో గొప్పగా మూవీ తీశారు" అని తమ సందేశాన్ని పోస్టులో వెల్లడించింది. 

ఈ మూవీ జూన్ 20న థియేటర్లలో విడుదలైంది. ఫస్ట్ టాక్ తోనే పాజిటివ్ రెస్పాన్స్ దక్కించుకుంది. అంతేకాకుండా.. విమర్శకుల నుండి మరియు ప్రేక్షకుల నుండి మంచి ప్రశంసలు అందుకుంటుంది. 

ఈ సినిమాలో ఆమిర్‌ఖాన్ బాస్కెట్‌బాల్‌ కోచ్‌ అయిన గుల్షన్‌ పాత్రలో నటించారు. మానసికంగా సవాళ్లు ఎదుర్కొంటున్న (ఆటిజం ఉన్న పిల్లల) బృందాన్నీ, నేషనల్ ప్లేయర్స్‌గా ఎలా తీర్చిదిద్దారనే కథాంశంతో మూవీ రూపొందింది.

ఇందులో మానసికంగా సవాళ్లు ఎదుర్కొంటున్న పిల్లల ఆట తీరు, ఈ క్రమంలో వారికీ వచ్చే కష్టాలను కళ్ళకు కట్టినట్లుగా చూపించారు. అసలు ఇలాంటి పిల్లలను ప్లేయర్స్‌గా మలచాలంటే.. ఎలాంటి మెళుకువలు నేర్పాలో సినిమాలో చక్కగా చూపించారు.

కామెడీ, ఎమోషన్, ఎంటర్‌‌‌‌‌‌‌‌టైన్మెంట్‌.. ఇలా ప్రతిదీ కథలో పొందుపరిచిన విధానం ప్రేక్షకుల చేత విజిల్ కొట్టించుకుంటోంది. హాలీవుడ్‌లో 2018 సంవత్సరంలో రిలీజైన స్పానిష్ మూవీ ఛాంపియన్స్ సినిమా ఆధారంగా మూవీని ఆర్ఎస్ ప్రసన్న రూపొందించారు.