జైసల్మేర్: రాష్ట్రపతి, సాయుధ బలగాల సుప్రీం కమాండర్ ద్రౌపది ముర్ము చరిత్ర సృష్టించారు. దేశీయంగా అభివృద్ధి చేసిన తేలికపాటి వార్ హెలికాప్టర్ ‘ప్రచండ్’ లో శుక్రవారం ఆమె ప్రయాణించారు. ఈ హెలికాప్టర్లో ప్రయాణించిన మొదటి రాష్ట్రపతిగా ఆమె రికార్డు సాధించారు.
ముందుగా ఉదయం 9.15 గంటలకు జైసల్మేర్లోని ఎయిర్ ఫోర్స్ స్టేషన్కు రాష్ట్రపతి చేరుకున్నారు. హెలికాప్టర్ గురించి అధికారులు ఆమెకు వివరించారు. అనంతరం ఎయిర్ ఫోర్స్ యూనిఫాం వేసుకున్న ముర్ము.. 10.15 గంటలకు ప్రచండ్ హెలికాప్టర్లోని కాక్ పిట్ లో కూర్చుని గ్రూప్ కెప్టెన్ ఎన్ఎస్ బహువాతో కలిసి ప్రయాణించారు.
25 ని మిషాల పాటు ఆమె ఏరియల్ రివ్యూ చేశారు. పోఖ్రాన్ ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్, చారిత్రక శక్తి స్థల్తో పాటు పాకిస్తాన్ సరిహద్దు ప్రాంతాలను కూడా పరిశీలించారు. హెలికాప్టర్ నుంచే సెల్యూట్ చేస్తూ కనిపించారు.
కాగా..2023 ఏప్రిల్ 8న కూడా తేజ్పూర్ ఎయిర్ బేస్లోని సుఖోయ్ 30 ఎంకేఐలో ప్రయాణించిన రెండో రాష్ట్రపతిగా ముర్ము చరిత్ర సృష్టించారు.
