మార్చి 15న తెలంగాణకు రాష్ట్రపతి ముర్ము

మార్చి 15న తెలంగాణకు రాష్ట్రపతి ముర్ము

 హైదరాబాద్, వెలుగు :  ఈ నెల 15న రాష్ట్రా ని కి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము  రానున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రపతి పర్య టనకు సంబంధించిన ఏర్పాట్లపై సీఎస్​ శాంతికుమారి సెక్రటేరియెట్​లో సోమవారం అధికారులతో సమీక్షించారు. 16న  ఉపరాష్ట్రపతి కూడా వస్తారని.. ఈ నేపథ్యంలో ఎటువంటి అవాంతరాలు లేకుండా చూసుకో వడంతోపాటు ముందుగానే తగిన రీతిలో అన్ని ఏర్పాట్లు చేయాలని ఆమె అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో డీజీపీ రవిగుప్తా, హోంశాఖ ముఖ్య కార్యదర్శి జితేందర్‌, జీఏడీ సెక్రటరీ రఘునందన్‌రావు, సీఎండీ టీఎస్‌పీడీసీఎల్‌ ముషారఫ్‌  పాల్గొన్నారు.