వీకెండ్‌లో హైదరాబాద్ రోడ్లపై పోలీసుల సడన్ డ్రైవ్..529 మందిపై కేసులు

వీకెండ్‌లో హైదరాబాద్ రోడ్లపై పోలీసుల సడన్ డ్రైవ్..529 మందిపై కేసులు

హైదరాబాద్​ సిటీ పరిధిలో తాగి బండి నడిపే వాళ్ల తాట తీస్తున్నారు ట్రాఫిక్​ పోలీసులు.. వీకెండ్​ లో నగరవ్యాప్తంగా  రోడ్లపై తనిఖీలు  చేసి జైలుకు పంపుతున్నారు.  తాగి బండి నడిపి వారికే కాదు, ఇతరులకుకూడా ప్రమాదంలో పడేలా చేస్తున్నారని , తాగి డ్రైవ్​ చేస్తే తీవ్రపరిణామాలుంటాయని అరెస్టులతో హెచ్చరిస్తున్నారు. 

ఆదివారం (నవంబర్​9) హైదరాబాద్​ సిటీలో వీకెండ్​ డ్రంక్​ అండ్​ డ్రైవ్​ తనిఖీలు చేశారు  సైబరాబాద్​ ట్రాఫిక్​ పోలీసులు. తాగి డ్రైవ్​ చేసిన మొత్తం 529 మందిని జైలుకు పంపారు. వీరందరని కోర్టులో హాజరు పర్చనున్నారు. 

ఆదివారం సిటీలో నిర్వహించిన డ్రంక్​ అండ్​ డ్రైవ్​తనిఖీల్లో మొత్తం 417 బైకులు, 24 ఆటోలు , 88 కార్లను పట్టుకున్నారు ట్రాఫిక్​ పోలీసులు.. తాగి వాహనాలునడుపుతున్న  529 మందిపై BNS చట్టం ప్రకారం 2023లోని సెక్షన్​ 105 కింద కేసు నమోదు చేశారు. ఈ సెక్షన్​ ప్రకారం తాగి బండి నడిపిన వారికి గరిష్టంగా పదేళ్ల జైలు శిక్ష, జరిమానా విధించబడుతుందని పోలీసులు చెప్పారు. 

గత వారం కూడా తనిఖీ చేపట్టిన ట్రాఫిక్​ పోలీసులు.. 357 డ్రంక్​ అండ్​ డ్రైవ్​కేసులు కోర్టులో డిస్పోజ్​ చేశారు. అందులో  మందిని కోర్టు గత వారం లో మొత్తం 357 డ్రంక్ డ్రైవింగ్ కేసులు కోర్టుల్లో హాజరపర్చగా   వారిని 307 మంది జరిమానాతో బయటపడ్డారు. మిగతా వారికి జైలు శిక్ష పడింది.