- రూ.5 వేలు తగ్గిన వెండి.. పసిడి ధర రూ.2,200 పతనం
న్యూఢిల్లీ: దేశ రాజధానిలో బంగారం వెండి ధరలు మంగళవారం భారీగా తగ్గుముఖం పట్టాయి. అంతర్జాతీయ మార్కెట్లలో నెలకొన్న బలహీన పరిస్థితులు, దేశీయంగా డిమాండ్ తగ్గడంతో రేట్లు రెండు శాతం వరకు క్షీణించాయి.
ఆల్ ఇండియా సరాఫా అసోసియేషన్ వెల్లడించిన వివరాల ప్రకారం వెండి ధర కిలోకు రూ.ఐదు వేలు తగ్గి రూ.2.45 లక్షలకు చేరుకుంది. సోమవారం మార్కెట్ ముగిసే సమయానికి వెండి ధర రూ.2.50 లక్షలుగా ఉండేది. పసిడి ధర కూడా గణనీయంగా పడిపోయింది.
99.9 శాతం స్వచ్ఛత కలిగిన 10 గ్రాముల బంగారం ధర రూ.2,200 తగ్గి రూ.1.57 లక్షల వద్ద స్థిరపడింది. గత సెషన్లో ఇది రూ.1.59 లక్షల పైన పలికింది. అమెరికాలో ద్రవ్యోల్బణం గణాంకాలు ఆశాజనకంగా ఉండటంతో ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల తగ్గింపుపై అంచనాలు పెరిగాయి. దీనికి తోడు చైనాలో న్యూ ఇయర్ సెలవులు ఉండటంతో ఆసియా మార్కెట్లలో లిక్విడిటీ తగ్గి, బంగారం ధరలపై ఒత్తిడి పెరిగింది.
