ఆపరేషన్‌‌ సిందూర్‌‌ ..పేరు పెట్టింది మోదీనే

ఆపరేషన్‌‌ సిందూర్‌‌ ..పేరు పెట్టింది మోదీనే

న్యూఢిల్లీ: పహల్గాంలో టెర్రరిస్టుల దాడికి ప్రతీకారంగా మన దేశం చేపట్టిన ఆపరేషన్‌‌కు ‘ఆపరేషన్‌‌ సిందూర్‌‌’‌‌ అనే పేరును ప్రధాని నరేంద్ర మోదీనే సూచించారని అధికార వర్గాలు తెలిపాయి. మతం అడిగి మరీ చంపిన వారి వైఖరికి జవాబుగా హిందూత్వ ప్రతీక అయిన, సిందూరాన్ని గుర్తు చేసేలా ఈ దాడులకు ఆపరేషన్ సిందూర్ అని పేరు పెట్టినట్లు వెల్లడించాయి. పహల్గాం పర్యటనకు వచ్చిన జంటల్లో ముఖ్యంగా మగవాళ్లనే టెర్రరిస్టులు చంపేశారు. 

మతం అడిగిమరీ వాళ్లను కాల్చి చంపారు. దీంతో బాధిత భార్యల సిందూరం దూరమైనట్లయింది. కాబట్టి, ఈ దారుణానికి పాల్పడిన టెర్రరిస్టులపై ప్రతీకారంగా చేసిన దాడులకు ఆపరేషన్‌‌ సిందూర్‌‌‌‌ అనేది సరైన మారుపేరు అవుతుందని అధికారవర్గాలు పేర్కొన్నాయి.