
నందమూరి తారకరత్న మృతి పై ప్రధాని మోడీ ట్విట్టర్ వేదికగా సంతాపం వ్యక్తం చేశారు. తారకరత్న మృతి చెందారన్న వార్త తనను ఎంతో కలిచివేసిందన్నారు. చిన్న వయసులోనే అతడు మరణించడం బాధాకరమని మోడీ అన్నారు. ఎంతో భవిష్యత్తు ఉన్న తారకరత్న అకాల మరణం ఆయన కుటుంబసభ్యులు, తెలుగు ప్రజలకు తీరని లోటని మోడీ ట్వీట్ చేశారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని మోడీ కోరుకున్నారు. తారకరత్న కుటుంబసభ్యులకు మనోధైర్యం కలిగించాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నట్లు మోడీ తెలిపారు. ఇక రేపు ఉదయం నుంచి సాయంత్రం వరకు తెలుగు ఫిలిం ఛాంబర్లో తారకరత్న పార్థివదేహాన్ని ప్రజల సందర్శనార్థం ఉంచనున్నారు. రేపు సాయత్రం ఐదు గంటలకి మహాప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు తెలుస్తోంది.