కాలుకి గాయంతో తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ప్రధాని మోదీ స్పందించారు. కేసీఆర్ గాయపడ్డారని తెలిసి బాధపడ్డానని ట్వీట్ చేశారు. ఆయన త్వరగా కోలుకోవాలని, ఆయన ఆరోగ్యం బాగుండాలని దేవుడిని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు.
Distressed to know that former Telangana CM Shri KCR Garu has suffered an injury. I pray for his speedy recovery and good health.
— Narendra Modi (@narendramodi) December 8, 2023
డిసెంబర్ 7న అర్థరాత్రి కేసీఆర్ తన ఫాంహౌజ్ లోని బాత్రూంలో కాలు జారి పడ్డారు. దీంతో కాలుకి తీవ్ర గాయం అయ్యింది. అర్థరాత్రి 2 గంటల తర్వాత కేసీఆర్ ను సోమాజిగూడలోని యశోద ఆస్పత్రికి తరలించారు. కేసీఆర్ కు ఎక్స్ రే, స్కానింగ్ తీసిన డాక్టర్లు కాలి తుంటి దగ్గర గాయం అయినట్లు గుర్తించారు. ప్రస్తుతానికి ఆయనకు చికిత్స అందిస్తున్నామని..కేసీఆర్ ఆరోగ్యం నిలకడగా ఉందని వెల్లడించారు. మరోవైపు కేటీఆర్, కవిత, హరీశ్ రావు యశోదా ఆస్పత్రికి చేరుకున్నారు.
ALSO READ:డబ్ల్యూపీఎల్ కమిటీ హెడ్గా రోజర్ బిన్నీ
మరో వైపు కేసీఆర్ స్వల్ప గాయాలతో ప్రస్తుతం ఆస్పత్రిలో స్పెషలిస్టుల ఆధ్వర్యంలో ట్రీట్ మెంట్ జరుగుతుందని ఎమ్మెల్సీ కవిత ట్వీట్ చేశారు. నాన్న త్వరగా కోలుకుంటున్నారని..అందరి ప్రేమాభిమానాలకు ధన్యవాదాలని తెలిపారు. బీఆర్ఎస్ సీనియర్ నేతలు, మాజీ మంత్రులు ఆస్పత్రికి చేరుకుంటున్నారు. కేసీఆర్ ఆరోగ్యంపై ఆరాదీస్తున్నారు.