
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ శనివారం అర్ధరాత్రి జర్మనీ వెళ్తున్నారని, 26–27వ తేదీల్లో నిర్వహించే జీ–7 సమ్మిట్లో హాజరవుతారని ఫారిన్ సెక్రటరీ వినయ్ క్వాత్రా శుక్రవారం వెల్లడించారు. జర్మనీ చాన్స్లర్ ఓలాఫ్ స్కోల్జ్ ఆహ్వానం మేరకు మోడీ సమ్మిట్లో పాల్గొంటారన్నారు. ఇండియాతో పాటు అర్జెంటీనా, ఇండోనేషియా, సెనెగల్, దక్షిణాఫ్రికా దేశాలకు కూడా గెస్ట్ కంట్రీస్గా జర్మనీ ఆహ్వానించినట్టు తెలిపారు. సదస్సులో భాగంగా జీ–7 దేశాధినేతలతో పాటు గెస్ట్కంట్రీస్ అధ్యక్షులతో కూడా ప్రధాని మోడీ ద్వైపాక్షిక చర్చలు జరుపుతారని స్పష్టం చేశారు. పర్యావరణం, ఎనర్జీ, వాతావరణం, ఆహార భద్రత, హెల్త్, జెండర్ ఈక్వాలిటీతో పాటు డెమోక్రసీ అంశాలపై జీ–7 సదస్సులో చర్చిస్తారని తెలిపారు. సమ్మిట్పూర్తయిన తరువాత 28వ తేదీన మోడీ జర్మనీ నుంచి యూఏఈ వెళ్తారని పేర్కొన్నారు. ఈ పర్యటనలో యూఏఈ కొత్త ప్రెసిడెంట్ షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ తో భేటీ అవుతారు. ఆ తరువాత ఇండియాకు తిరిగి వస్తారని ఫారిన్ సెక్రటరీ తెలిపారు.