పార్టీకోసం పనిచేసే కార్యకర్తలకు ప్రాధాన్యత: మంత్రి హరీష్రావు

పార్టీకోసం పనిచేసే కార్యకర్తలకు ప్రాధాన్యత: మంత్రి హరీష్రావు

పనిచేసే కార్యకర్తలకు పార్టీలో ఎప్పుడూ ప్రాధాన్య త ఉంటుందని మంత్రి హరీష్ రావు అన్నారు.  జహీరాబాద్ నియోజకవర్గ బీఆర్ ఎస్ పార్టీ ముఖ్య నేతలతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ... ఉమ్మడి మెదక్ జిల్లాలో జహీరాబాద్ కు ప్రత్యేక గుర్తింపు ఉంది. మూడోసారి మాణిక్ రావుకు బీఆర్ ఎస్ టికెట్ ఇచ్చాం.. పార్టీ నిర్ణయించిన అభ్యర్థి మాణిక్ రావును గెలిపించి సీఎం కేసీఆర్ కు కానుకగా ఇవ్వాలని హరీష్ రావు కార్యక్తలను కోరారు. 

పార్టీ గెలుపు కోసం కలిసికట్టుగా పనిచేయాలని.. పనిచేసే కార్యకర్తలకు పార్టీలో ఎప్పుడూ ప్రాధాన్యత ఉంటుందని హరీష్రావు స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్ హ్యాట్రిక్ విజయంలో జహీరాబాద్ నియోజకవర్గ ప్రజలు భాగస్వాములు కావాలని కోరారు.  

ఈ సమావేశంలో ఎమ్మెల్యే మాణిక్ రావు, డీసీఎంఎస్ చైర్మన్ శివకుమార్, టీఎస్ఐడీసీ తన్వీర్, నర్వోత్తంలతో పాటు అన్ని మండలాల ముఖ్య నాయకులు పాల్గొన్నారు.