కాంగ్రెస్ అధికారంలోకి వస్తేనే యాదవులకు ప్రాధాన్యత : రాజు యాదవ్

కాంగ్రెస్ అధికారంలోకి వస్తేనే యాదవులకు ప్రాధాన్యత : రాజు యాదవ్

ఖైరతాబాద్, వెలుగు: రాష్ట్రంలో రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని ఆ పార్టీ సనత్ నగర్ సెగ్మెంట్ నేత ఎం. రాజు యాదవ్ తెలిపారు. మంగళవారం సోమాజిగూడ ప్రెస్​క్లబ్​లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. తొమ్మిదన్నరేండ్ల పాలనలో బీఆర్ఎస్ సర్కారు రేషన్ కార్డులు ఇవ్వలేకపోయిందన్నారు.

సనత్ నగర్ కాంగ్రెస్ అభ్యర్థి కోట నీలిమకు ఓటేసి భారీ మెజార్టీతో గెలిపించాలని ఆయన కోరారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే యాదవ కార్పొరేషన్ ఏర్పాటు చేయనున్నట్లు పార్టీ ప్రకటించిందని రాజు యాదవ్ పేర్కొన్నారు. కార్యక్రమంలో రమేశ్ బాబు తదితరులు పాల్గొన్నారు.