శివను ఎన్ కౌంటర్ చేయాలని డిమాండ్ చేస్తూ రాస్తారోకో

శివను ఎన్ కౌంటర్ చేయాలని డిమాండ్ చేస్తూ రాస్తారోకో

హైదరాబాద్ ఎల్ బీనగర్ లో ఓ ప్రేమోన్మాది పెళ్లికి నిరాకరిస్తోందనే కారణంతో ప్రియురాలు సంఘవి, ఆమె బ్రదర్ పృథ్విపై కత్తితో దాడికి పాల్పడిన విషయం విదితమే. ఈ ఘటనలో సోదరుడు మరణించాడు. 

అతని అంత్యక్రియాలు సెప్టెంబర్ 4న పూర్తి అయ్యాయి. మృతదేహాన్ని రంగారెడ్డి జిల్లా ఫరూక్ నగర్ మండలం నేరెళ్ల చెరువు గ్రామానికి అంబులెన్స్ లో తరలించారు. అదే సమయంలో అంబులెన్స్ ని బాధిత కుటుంబ సభ్యులు, స్థానికులు అడ్డుకున్నారు. 

పృథ్విని చంపిన శివకుమార్ ని ఎన్ కౌంటర్ చేయాలని నినాదాలు చేశారు. వారి కుటుంబానికి న్యాయం జరిగే వరకు పోరాటం ఆపేది లేదని స్పష్టం చేశారు. రాస్తా రోకోతో కిలో మీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయింది. విషయం తెలుసుకున్న పోలీసులు నిరసనకారులకు సర్ది చెప్పడంతో శాంతించారు. 

నిందితుడు శివకుమార్ ఇది వరకే తండ్రిని చంపాడనే ఆరోపణలు ఉన్నాయి.