ప్రైవేట్​ ట్రావెల్స్ బస్సులు ఢీ.. తప్పిన పెను ప్రమాదం..

ప్రైవేట్​ ట్రావెల్స్ బస్సులు ఢీ..  తప్పిన పెను  ప్రమాదం..

రెండు ప్రైవేటు ట్రావెల్స్​ బస్సులు ఢీ కొన్న ఘటన నిజామాబాద్​లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పెర్కిట్​ 44వ జాతీయ రహదారిపై హైదరాబాద్​ నుంచి ఛత్తీస్​ఘడ్​ వెళ్తున్న బస్సును.,.. అటు వైపే వెళ్తున్న మరో బస్సు వెనక నుంచి ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు ప్రయాణికులు,  డ్రైవర్ కు గాయాలయ్యాయి. 

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.