
- ఆర్ట్స్ కాలేజీ వద్ద ఏబీవీపీ స్టూడెంట్ల ఆందోళన
ఓయూ,వెలుగు: ఉస్మానియా వర్సిటీలో కొంత కాలంగా నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఏబీవీపీ ఆధ్వర్యంలో స్టూడెంట్లు సోమవారం ఆర్ట్స్ కాలేజీ వద్ద ఆందోళన చేపట్టారు.
ప్రతి స్టూడెంట్కు 10 నెలల మెస్ బిల్ వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని, ఎన్సీపీ, ఈ – పాస్ వచ్చే విధంగా చూడాలని రూ. 100 ఉన్న బోనఫైడ్ ఫీజును రూ. 10లకు తగ్గించాలని విద్యార్థినులకు క్లాస్ టైమ్కి అనుగుణంగా బస్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. హాస్టళ్లల్లో ఫుడ్ నాణ్యత పెంచాలన్నారు. ప్రతివారంలో ఒకరోజు స్టూడెంట్ల హాస్టళ్లను అధికారులు తనిఖీ చేయాలని ఆర్ట్స్ కాలేజ్ నుంచి సెంటినరీ హాస్టల్ వరకు లైట్స్ , సీసీ టీవీలను ఏర్పాటు చేసి, ఆగంతకులు నుంచి రక్షణగా సెక్యూరిటీ నియమించాలని కోరారు.
స్టూడెంట్ల ఆందోళన తెలుసుకుని ఆర్ట్స్ కాలేజీ ప్రిన్సిపల్ ప్రొఫెసర్ గణేశ్ వచ్చి వారితో చర్చించారు. వీలైనంత త్వరలో సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. అనంతరం సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని ప్రిన్సిపల్కు అందజేశారు. ఈ ఆందోళనలో ఏబీవీపీ నేతలు సాయికుమార్, ధృవన్, విష్ణు, హరి, శ్రీనివాస్ పాల్గొన్నారు.