Vikramarkudu2: విక్రమార్కుడు 2 స్టోరీ రెడీ..స్టేజీపై నిర్మాత రాధామోహన్ కామెంట్స్

Vikramarkudu2: విక్రమార్కుడు 2 స్టోరీ రెడీ..స్టేజీపై నిర్మాత రాధామోహన్ కామెంట్స్

మాస్ మహారాజ రవితేజ(RaviTeja)కెరీర్ బెస్ట్ సినిమాల్లో టాప్ 3 లిస్టులో ఖచ్చితంగా ఉండే సినిమా విక్రమార్కుడు(Vikramarkudu). దర్శకధీరుడు రాజమౌళి(Rajamouli) తెరకెక్కించిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర భారీ విజయాన్ని అందుకుంది. ఇక ఈ సినిమాలో రవితేజ నటన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఓపక్క అత్తిలి సత్తిబాబుగా కడుపుబ్బా నవ్విస్తూనే..మరోపక్క విక్రమ్ రాథోడ్ గా అద్భుతమైన హీరోయిజాన్ని పలికించాడు.

ఇక ఈ సినిమా చూసిన ఆడియన్స్, మరీ ముఖ్యంగా రవితేజ ఫ్యాన్స్ పిచ్చ..పిచ్చగా ఎంజాయ్ చేశారు అనడంలో ఎలాంటి సందేహం లేదు.ఒకానొక సందర్భంలో ఈ సినిమాకు కథ అందించిన రచయిత విజయేంద్రప్రసాద్ మాట్లాడుతూ..విక్రమార్కుడు సినిమాను అన్ని లాంగ్వేజ్ లో రీమేక్ చేశారు కానీ, తెలుగులో రవితేజ క్రియేట్ చేసిన ఇంపాక్ట్ ను ఎవరు క్రియేట్ చేయలేకపోయారు అనడం మామూలు విషయం కాదు. 

అయితే రీసెంట్గా భీమా ప్రమోషన్స్ లో భాగంగా ఇటీవల ఇంటర్వ్యూలో పాల్గొన్న చిత్ర నిర్మాత కేకే రాధామోహన్ ఈ సీక్వెల్పై మాట్లాడిన విషయం తెలిసిందే.ఇక తాజాగా మరో మారు రాధామోహన్ స్పందించారు.ప్రస్తుతం ఆయన బాలీవుడ్‌లో తొలిసారిగా నిర్మిస్తున్న సినిమా రుస్లాన్.ఈ సినిమా ఈవెంట్ కి రచయిత విజయేంద్ర ప్రసాద్ ముఖ్య అథిగా హాజరయ్యారు.ఇందులో భాగంగా ఆయన మాట్లాడుతూ విక్రమార్కుడు సీక్వెల్ పై ఆసక్తికర కామెంట్స్ చేశారు.. 

Also Read:ఆ సంగీత త్రిమూర్తుల కంటే..ఇళయరాజా గొప్పవారేమి కాదు
 
'రైటర్ విజయేంద్ర ప్రసాద్ గారు నాకు రెండు స్టోరీలు తయారు చేశారు. ఒకటి విక్రమార్కుడు 2. హిందీలో రౌడీ రాథోడ్ 2. తెలుగులో విక్రమార్కుడు 2.ఈ సినిమా సీక్వెల్ కథ సిద్ధంగా ఉంది. ఇందులో నటించబోయే క్యాస్టింగ్ గురించి ట్రై చేస్తున్నాం.కథకు తగ్గ సరైనా క్యాస్టింగ్ దొరికితే వెంటనే స్టార్ట్ చేసే అవకాశం ఉందని నిర్మాత కేకే రాధామోహన్ అన్నారు.కానీ, రవితేజ గారు నుండి గ్రీన్ సిగ్నల్ రాలేదు. ఈ విషయంలో ఆయన్ని ఒప్పించే ప్రయత్నంలోనే మా టీమ్ ఉంది. రవితేజ గారు ఒప్పుకున్నా వెంటనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్తుంది.. అంటూ చెప్పుకొచ్చారు రాధామోహన్.

ప్రస్తుతం ఉన్న సమాచారం మేరకు విక్రమార్కుడు సినిమాకు సీక్వెల్ కు సంపత్ నంది దర్శకత్వం వహిస్తారని సమాచారం. ఈ విషయంపై త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది. ఈ న్యూస్ తెలుసుకున్న రవితేజ ఫ్యాన్స్ చాలా హ్యాపీగా ఉన్నారు. ఇక రవితేజ సినిమాల విషయానికి వస్తే.. ఇటీవలే ఈగల్ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న రవితేజ..ప్రస్తుతం దర్శకుడు హరీష్ శంకర్ తో మిస్టర్ బచ్చన్ చేస్తున్నారు. ఇటీవలే లాంఛనంగా ప్రారంభమైన ఈ సినిమా బాలీవుడ్ సూపర్ హిట్ సినిమా రైడ్ కు రీమేక్ గా తెరకెక్కుతోంది.ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.