తెలంగాణ ప్రభుత్వం కూడా రాష్ట్రంలోని ఓ జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టాలని ప్రముఖ నిర్మాత వైవీఎస్ చౌదరి అన్నారు. సీఎం జగన్ పంథాలోనే తెలంగాణ ప్రభుత్వం కూడా త్వరలోనే ఓ జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టాలని చౌదరి కోరారు. అలాగే ప్రధాని నరేంద్రమోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఎన్టీఆర్కు ‘భారతరత్న’అవార్డు ఇవ్వాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
విజయవాడ కేంద్రంగా కొత్తగా ఏర్పడబోతున్న జిల్లాకు ఎన్టీఆర్ జిల్లాగా పేరు పెట్టాలన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రముఖ దర్శక, నిర్మాత వైవీఎస్ చౌదరి స్వాగతించారు. తెలుగు ప్రజల అభిమతం, ఆకాంక్షలకు అనుగుణంగా నిర్ణయం తీసుకున్న సీఎం జగన్ మోహన్ రెడ్డికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
For More News..
67 ఏండ్లున్న కేసీఆర్ సీఎం కావొచ్చు.. రైతులు మాత్రం బీమాకు అనర్హులా?