రైతు బీమా వయసును బట్టి ఎలా నిర్ణయిస్తారని వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ప్రశ్నించారు. రైతు బీమా వయసు పరిమితిని 59 ఏండ్లుగా నిర్ణయించడంపై ఆమె మండిపడ్డారు. 60 ఏండ్లు పైబడిన వారు రైతులు కాదా అని అడిగారు. అసలు రైతంటే ఎవరో కేసీఆర్ చెప్పాలని అన్నారు. భూమి ఉన్నవారు, పాసుబుక్కు ఉన్నవారు మాత్రమే రైతులా అని ప్రశ్నించారు. 67 ఏండ్లున్న కేసీఆర్ సీఎం కావొచ్చు కానీ 59 ఏండ్లు నిండిన రైతులు మాత్రం బీమాకు అనర్హులా? అని ఎద్దేవా చేశారు. కేసీఆర్ కు చిత్తశుద్ది ఉంటే వయసుతో సంబందం లేకుండా రైతుబీమా ఇవ్వాలని డిమాండ్ చేశారు.
https://t.co/2wbJK03ryQ
— YS Sharmila (@realyssharmila) January 27, 2022
KCR గారు రైతు అంటే ఎవరో నిర్వచనం చెప్పాలి.
భూమి ఉన్నవారు రైతా?
పాసుబుక్కు ఉన్నవారు రైతా?
59 ఏండ్లలోపు ఉండి సాగు చేసేవారే రైతా?
60 ఏండ్లు దాటిన వారు రైతు కాదా?
కౌలుకు తీసుకుని సాగు చేసేవారు రైతు కాదా?
రైతు బీమా పరిమితిని 59ఏండ్లుగా ఎలా నిర్ణయిస్తరు.1/2
For More News..