కారులో ఎక్కించుకుని పొడిచిన్రు... ఆస్తి తగాదాలతో వ్యక్తి హత్య

కారులో ఎక్కించుకుని పొడిచిన్రు... ఆస్తి  తగాదాలతో వ్యక్తి హత్య

గండిపేట, వెలుగు: ఆస్తి తగాదాలతో ఓ వ్యక్తిని దారుణంగా హత్య చేశారు. చాంద్రాయణగుట్టకు చెందిన మహ్మద్‌‌‌‌ అర్బాజ్‌‌‌‌(31), చింతల్​మెంట్​కు చెందిన మొహమ్మద్‌‌‌‌ అజ్జు(23), అత్తాపూర్‌‌‌‌కు చెందిన సులేమాన్‌‌‌‌ఖాన్‌‌‌‌(25) సమీప బంధువులు. వీరికి తాతల తరఫున కర్నాటక రాష్ట్రంలోని బాల్కి దుగుల్లుండి గ్రామంలో ఆస్తులున్నాయి. వాటి విషయంలో తగాదాలు నడుస్తున్నాయి. ఈ క్రమంలో అర్బాజ్​ను హతమార్చాలని మిగతా ఇద్దరు పథకం పన్నారు. 

బుధవారం ఉదయం అర్బాజ్‌‌‌‌ను కారులోకి బలవంతంగా కూర్చోబెట్టుకున్నారు. సులేమాన్​కాన్​ కారు నడుపుతుండగా అర్బాజ్​ ముందు సీటులో ఉన్నాడు. వెనక సీటులో ఉన్న అజ్జు కత్తితో అర్బాజ్​పై దాడి చేశారు. మెడపై విచక్షణారహితంగా పొడవడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. డెడ్​బాడీని ఏజీ కాలేజీ ప్రధాన ద్వారం దగ్గర పడేసి పారిపోయారు. సీసీ కెమెరాలను పరిశీలించి నిందితులను పోలీసులు పట్టుకున్నారు. బలెనో కారు, రెండు సెల్‌‌‌‌ఫోన్లు, కత్తి స్వాధీనం చేసుకున్నారు.