బషీర్బాగ్, వెలుగు: మహాత్మా గాంధీ పేరును ఉపాధి హామీ పథకం నుంచి తొలగించడాన్ని ఖండిస్తూ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో బాబు జగ్జీవన్రామ్ విగ్రహం వద్ద శనివారం ధర్నా నిర్వహించారు.
ఈ సందర్బంగా ఎస్సీ కమిషన్ మాజీ చైర్మన్ డా. పిడమర్తి రవి మాట్లాడుతూ.. మహాత్మా గాంధీ దేశానికి చేసిన సేవలను ప్రజలు ఎప్పటికీ మరచిపోలేరని, ఉపాధి హామీ పథకానికి గాంధీ పేరును కొనసాగించాలని డిమాండ్ చేశారు. రాజీవ్ గాంధీ ఫెలోషిప్కు సంబంధించి యూజీసీ కొత్త విధానాన్ని కూడా వ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు.
