యాదాద్రి భువనగిరి జిల్లా ZP మీటింగ్ రసాబాసగా మారింది. సమావేశంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన ZPTC నగేష్ మాట్లాడుతుండగా మైక కట్ చేశారు. దీంతో అధికాపార్టీ నేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు కాంగ్రెస్ ZPTC. మైక్ ను నేలకు కొట్టి... పోడియం ముందు నిరసన వ్యక్తం చేశారు. గ్రామాల్లో జరిగే ప్రారంభోత్సవాలకు ప్రోటోకాల్ పాటించటం లేదని మండిపడ్డారు. నిధుల మంజూరులో కూడా అవకతవకలు జరుగుతున్నాయన్నారు. ప్రతిపక్ష పార్టీల్లో గెలిచిన మండలాలకు నిదులు కేటాయించటం లేదని నిరసన తెలిపారు.