
టాలీవుడ్ డైరెక్టర్ రాజమౌళి దంపతులకు ఆరుదైన గౌరవం దక్కింది. ఆస్కార్ అకాడమీలో చేరాలని వీరికి ఆహ్వానం అందింది. డైరెక్టర్స్ కేటగిరిలో రాజమౌళి, కాస్ట్యూమ్ డిజైనర్ జాబితాలో రమా రాజమౌళి ఈ అరుదైన అవకాశాన్ని సొంతం చేసుకున్నారు. ఈ ఏడాది 57 దేశాల నుంచి మొత్తం 487 మంది సభ్యులకు ఆస్కార్ అకాడమీ ఆహ్వానాలు పంపింది. అందులో భారత్ నుంచి రాజమౌళి దంపతులతో పాటు మరికొందరు సినీ ప్రముఖులుఉన్నారు. షబానా అజ్మి, రితేశ్ సిద్వానీ, రవి వర్మన్ తదితరులు అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్స్ అండ్ ఆర్ట్స్ ఆహ్వానం అందుకున్న జాబితాలో ఉన్నారు. కాగా గతేడాది ఆర్ఆర్ఆర్లో నటించిన రామ్ చరణ్, ఎన్టీఆర్లతో పాటు కీరవాణి, సెంథిల్కుమార్ ఈ అకాడమీలో సభ్యత్వం పొందారు. ఇకపోతే టాలీవుడ్ సినిమా ఆర్ఆర్ఆర్తో ప్రపంచ వేదికపై రాజమౌళి సత్తా చాటాడు. ప్రస్తుతం మహేశ్బాబుతో చేయనున్న ప్రాజెక్ట్ పనుల్లో రాజమౌళి బిజీగా ఉన్నాడు. ఈ సినిమాకు సంబంధించి ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా జరుగుతున్నాయి. త్వరలోనే షూటింగ్ ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది.