
ప్రీమియం నట్స్, ఎండు ద్రాక్షలతో కూడిన గిఫ్ట్ ప్యాక్లను ప్రొవీ ఫుడ్స్ మార్కెట్లోకి తీసుకొచ్చింది. 300 గ్రాముల సైజ్లో నట్స్ ప్యాక్ను అందుబాటులోకి తెచ్చింది. ఇందులో 100 గ్రాముల చొప్పున బాదం పప్పులు, జీడి పప్పులు, ఎండు ద్రాక్ష ఉంటాయని కంపెనీ తెలిపింది. ఒక్కో ప్యాక్ ధర రూ.700. ఆఫర్లో రూ.400 కే కంపెనీ అందిస్తోంది.